Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాటరీలో రూ. 40 కోట్లు గెలుచుకున్న భారతీయుడు

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:03 IST)
యూఏఈలోని ఓ భారతీయుడు లాటరీలో 2 కోట్ల దిర్హామ్‌(దాదాపు రూ. 40 కోట్లు)లను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన అబ్దుస్సలామ్ అనే భారతీయుడు డిసెంబర్ 29న అబూధాబీలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ టికెట్‌పై అబ్దుస్సలామ్ 2 కోట్ల దిర్హామ్‌లు గెలుపొందాడు.

తాను ఇప్పటివరకు నాలుగైదు సార్లు ఈ రాఫిల్‌లో పాల్గొన్నానని, లాటరీ తగులుతుందని ఎన్నడూ అనుకోలేదన్నాడు. ఇప్పుడు ఒకేసారి ఇంత మొత్తం గెలుపొందడం నిజంగా ఆనందంగా ఉందన్నాడు.

తాను గెలుచుకున్న ప్రైజ్‌లో కొంత మొత్తాన్ని తన స్నేహితులకు ఇవ్వనున్నట్టు అబ్దుస్సలామ్ చెప్పాడు. తన పిల్లల చదువుకు మరికొంత డబ్బును పక్కన పెట్టనున్నట్టు చెప్పుకొచ్చాడు. కాగా.. ఇదే రాఫిల్‌లో మరో భారతీయుడు 30 లక్షల దిర్హామ్‌(దాదాపు రూ. 6 కోట్లు)ల లాటరీని గెలుపొందాడు. కాగా..
 
ఈ లాటరీ టికెట్ ధర 500 దిర్హామ్‌(దాదాపు రూ. పది వేలు)లు. వెయ్య దిర్హామ్‌లు పెడితే ఒకేసారి మూడు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా అబూధాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని లాటరీ స్టోర్లలో కూడా టికెట్లను కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments