Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో మునిగిన థాయ్‌లాండ్ యుద్ధనౌక

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (08:24 IST)
థాయ్‌లాండ్‌కు చెందిన భారీ యుద్ధనౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై 31 మంది గల్లంతయ్యారు. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో సముద్రతీరానికి 20 నాటికన్ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంఎస్ సుఖోథాయ్ యుద్ధ నౌక సోమవారం సాయంత్రం మునిగిపోయింది. 
 
ఈ యుద్ధ నౌక గస్తీలో నిమగ్నమైవుండగా, బలమైన ఈదురుగాలులు వీయడంతో ఓ చిగురుటాకులా వణికిపోయింది. అదేసమయంలో ఓడలోకి నీరు వచ్చి చేరింది. ఈ నీటికి బయటకు పంపే ప్రయత్నం సిబ్బంది చేసినప్పటికి ఆ చర్యలు ఫలించలేదు. పైగా, నౌకలోకి నీటి పోటు అధికం కావడంతో అది మునిగిపోయింది.
 
ఈ నౌక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాయల్ నేవీ బోట్లు, హెలికాఫ్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని నౌకలో 106 మంది సిబ్బందిలో 75 మందిని రక్షించారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలో నౌక అర్థరాత్రి సమయంలో పూర్తిగా నీటిలో మునిగిపోయింది. గల్లంతైన వారిని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నట్టు రాయల్ నేవీ అధికార ప్రతినిధి అడ్మిరల్ ఫోకరోంగ్ మోంథపలిన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments