Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠకు తెరపడింది.. శ్రీలంక ప్రధానిగా రణిలి విక్రమ సింఘే

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (14:43 IST)
దాదాపు రెండు నెలలుగా కొలంబోలో కొనసాగుతూ వచ్చిన ఉత్కంఠకు తెరపడింది. శ్రీలంక దేశ ప్రధానిగా రాణిల్ విక్రమసింఘే మరోమారు బాధ్యతలు స్వీకరించారు. 51 రోజుల క్రితం ఆయనను ప్రధాని పదవి నుంచి దించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనే విక్రమసింఘేతో ఇపుడు ప్రమాణం చేయించారు. కొలంబోలోని అధ్యక్షుడి సెక్రటేరియట్‌లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. 
 
శనివారం మహిందా రాజపక్సే ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో మరోసారి విక్రమసింఘేకు లైన్ క్లియరైంది. అక్టోబర్ 26న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. ఆ రోజు ప్రధానిగా ఉన్న విక్రమసింఘేను తొలగించి రాజపక్సేను సిరిసేన నియమించడంతో వివాదం మొదలైంది. రాజపక్సే నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టే చెప్పడంతో చేసేది లేక ఆయన తప్పుకున్నారు. శుక్రవారమే విక్రమసింఘేతో ఫోన్‌లో మాట్లాడిన సిరిసేన.. ఆయనను మరోసారి ప్రధానిని చేయడానికి అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments