Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం : అల్‌ఖైదా హెచ్చరిక

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:18 IST)
భారత్‌పై ఆత్మాహుతి దాడులు చేస్తామని అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. ఇటీవల బీజేపీకి చెందిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లు ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక ముస్లిం దేశాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. దీంతో బీజేపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పించారు. 
 
ఈ నేపథ్యంలో అల్‌ఖైదా ఉగ్ర సంస్థ భారత్‌కు గట్టి హెచ్చరిక చేసింది. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడటం కోసమే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ ఉగ్ర సంస్థ ప్రతినిధులు ఓ లేఖను విడుదల చేశారు. 
 
"మా ప్రవక్తను కించపరిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల దేవాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవం లేనివారిని పేల్చిపారేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురు చూడాలి" అంటూ ఆ లేఖలో హెచ్చరికలు చేశారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments