Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం : అల్‌ఖైదా హెచ్చరిక

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:18 IST)
భారత్‌పై ఆత్మాహుతి దాడులు చేస్తామని అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. ఇటీవల బీజేపీకి చెందిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లు ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక ముస్లిం దేశాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. దీంతో బీజేపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పించారు. 
 
ఈ నేపథ్యంలో అల్‌ఖైదా ఉగ్ర సంస్థ భారత్‌కు గట్టి హెచ్చరిక చేసింది. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడటం కోసమే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ ఉగ్ర సంస్థ ప్రతినిధులు ఓ లేఖను విడుదల చేశారు. 
 
"మా ప్రవక్తను కించపరిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల దేవాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవం లేనివారిని పేల్చిపారేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురు చూడాలి" అంటూ ఆ లేఖలో హెచ్చరికలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments