Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాలో భారత సంతతి వైరాలజీ శాస్త్రవేత్త మృతి

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (11:59 IST)
కరోనా మహమ్మారి ఎందరో అమాయికుతో పాటు... అనేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వైద్యులను పొట్టనబెట్టుకుంటుంది. ఈ వైరస్ బారినపడి తిరిగి కోలుకోలేక వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ చనిపోయారు. తాజాగా సౌతాఫ్రికాలో భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈమె పేరు గీతా రాంజీ. ప్రముఖ వైరాలజీ శాస్త్రవేత్త. 
 
ఈమెకు కరోనా వైరస్ సోకడంతో కన్నుమూశారు. ఈమె వయసు 64 యేళ్లు. హెచ్ఐవీ ప్రివెన్షన్ రీసర్చ్ టీమ్‌కు లీడర్‌గా ఉన్నారు. వ్యాక్సిన్ సైంటిస్ట్ అయిన ఆమె... వారం క్రితమే లండన్ నుంచి డర్బన్‌కు తిరిగొచ్చారు. 
 
ఆమెలో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఆమె మృతి పట్ల సౌతాఫ్రికా మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈవో గ్లెండా గ్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 2018లో యూరోపియన్ డెవలప్మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్‌నర్‌షిప్ ఆమెకు ఔట్ స్టాండింగ్ ఫిమేల్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. 
 
గీతా రాంజీ అంత్యక్రియలకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. దక్షిణాఫ్రికాలో 21 రోజుల లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరయ్యే జనాల సంఖ్యపై తీవ్ర ఆంక్షలు ఉన్నాయి. అంత్యక్రియల కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments