Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాలో భారత సంతతి వైరాలజీ శాస్త్రవేత్త మృతి

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (11:59 IST)
కరోనా మహమ్మారి ఎందరో అమాయికుతో పాటు... అనేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వైద్యులను పొట్టనబెట్టుకుంటుంది. ఈ వైరస్ బారినపడి తిరిగి కోలుకోలేక వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ చనిపోయారు. తాజాగా సౌతాఫ్రికాలో భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈమె పేరు గీతా రాంజీ. ప్రముఖ వైరాలజీ శాస్త్రవేత్త. 
 
ఈమెకు కరోనా వైరస్ సోకడంతో కన్నుమూశారు. ఈమె వయసు 64 యేళ్లు. హెచ్ఐవీ ప్రివెన్షన్ రీసర్చ్ టీమ్‌కు లీడర్‌గా ఉన్నారు. వ్యాక్సిన్ సైంటిస్ట్ అయిన ఆమె... వారం క్రితమే లండన్ నుంచి డర్బన్‌కు తిరిగొచ్చారు. 
 
ఆమెలో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఆమె మృతి పట్ల సౌతాఫ్రికా మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈవో గ్లెండా గ్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 2018లో యూరోపియన్ డెవలప్మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్‌నర్‌షిప్ ఆమెకు ఔట్ స్టాండింగ్ ఫిమేల్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. 
 
గీతా రాంజీ అంత్యక్రియలకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. దక్షిణాఫ్రికాలో 21 రోజుల లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరయ్యే జనాల సంఖ్యపై తీవ్ర ఆంక్షలు ఉన్నాయి. అంత్యక్రియల కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments