Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి వివాదం.. హైదరాబాద్‌లో తల్లీ కుమార్తెను గదిలో బంధించి గోడ కట్టేశారు.. ఎక్కడ?

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (09:29 IST)
ఆస్తి వివాదం ఓ తల్లీ కుమార్తెను చిక్కుల్లో నెట్టేసింది. ప్రత్యర్థులు ఆ ఇద్దరిని గదిలో బంధించి గోడ కట్టేశారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. హైదరాబాద్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం కాదండోయ్.. పాకిస్థాన్ దేశంలో ఉన్న హైదరాబాద్ సిటీ. ఈ నగరంలోని లతిఫాబాద్ ప్రాంతంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని గోడను బద్ధలు కొట్టి ఆ తల్లీ కుమార్తెలను ప్రాణాలతో రక్షించారు. ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే....
 
బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. వరుసకు బావ అయిన సుహైల్‌ కుమారులతో కలిసి గతకొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఆస్తి తగాదాల్లో భాగంగానే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అవి మరింత ముదరటంతో తనతో పాటు తన కుమార్తెను ఓ గదిలో బంధించి బయట నుంచి గోడ కట్టారని వాపోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి వారిని రక్షించారు. సుహైల్‌, ఆయన కుమారులపై కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యకు కారణమైన వారిపై కఠిన సెక్షన్ల కేసు నమోదు చేసి, తగిన శిక్ష పడేలా చేస్తామని స్థానిక పోలీస్ అధికారి ఫరూక్‌ లింజర్‌ తెలిపారు. దీన్ని ఘోరమైన చర్యగా అభివర్ణించిన ఆయన.. మున్ముందు ఈ ఘటనలు జరగకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments