Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు.. ఎక్కడ?

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (09:22 IST)
ఇద్దరు భార్యలు కలిసి తమ భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి చేశారు. ఈ ఆసక్తికర సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబరియలు మండలంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మండలంలోని కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000 సంవత్సరంలో పార్వతమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. కానీ, ఆమెకు సంతానం లేదు. దీంతో 2005లో అప్పలమ్మను పండన్న రెండో వివాహం చేసుకున్నాడు. 2007లో వీరికి ఓ బాబు పుట్టాడు. 
 
ఆ తర్వాత ఆమెకు సంతానం లేదు. అయితే, ఒక్క సంతానంతో సంతృప్తి చెందని పండన్న తమ ఇద్దరు భార్యల అనుమతితో మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో గత నెల 25వ తేదీన తన ఇద్దరు భార్యలే పెళ్ళి పెద్దలుగా వ్యవహించి పెళ్లి పత్రికలు ముద్రించి, బ్యానర్లు వేయించి, ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిపై పండన్న స్పందిస్తూ, తమ కుటుంబ సంతానం వృద్ధి కోసం తమ ఇద్దరు భార్యలు పెద్ద మనసుతో త్యాగం చేసి తనకు మూడో వివాహం చేశారంటూ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments