Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు.. ఎక్కడ?

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (09:22 IST)
ఇద్దరు భార్యలు కలిసి తమ భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి చేశారు. ఈ ఆసక్తికర సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబరియలు మండలంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మండలంలోని కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000 సంవత్సరంలో పార్వతమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. కానీ, ఆమెకు సంతానం లేదు. దీంతో 2005లో అప్పలమ్మను పండన్న రెండో వివాహం చేసుకున్నాడు. 2007లో వీరికి ఓ బాబు పుట్టాడు. 
 
ఆ తర్వాత ఆమెకు సంతానం లేదు. అయితే, ఒక్క సంతానంతో సంతృప్తి చెందని పండన్న తమ ఇద్దరు భార్యల అనుమతితో మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో గత నెల 25వ తేదీన తన ఇద్దరు భార్యలే పెళ్ళి పెద్దలుగా వ్యవహించి పెళ్లి పత్రికలు ముద్రించి, బ్యానర్లు వేయించి, ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిపై పండన్న స్పందిస్తూ, తమ కుటుంబ సంతానం వృద్ధి కోసం తమ ఇద్దరు భార్యలు పెద్ద మనసుతో త్యాగం చేసి తనకు మూడో వివాహం చేశారంటూ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments