Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాకింగ్ వెళ్లిన దంపతులను తరుముకున్న గజరాజు.. ఎక్కడ?

Advertiesment
Wild elephant
Wild elephant
కోయంబత్తూరులో అటవీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాకింగ్ వెళ్లిన కోవై దంపతులకు గజరాజు చుక్కలు చూపించింది. అడవి నుంచి నేను కూడా వాకింగ్ వచ్చానన్న రీతిలో ఆ దంపతుల వెంటపడింది. అంతే ఆ దంపతులు గజరాజును చూసి భయపడి పరుగులు తీశారు. అయినా ఆ ఏనుగు ఆ దంపతుల ఇంటి వరకు వచ్చింది. గేటు తెరిచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. 
 
కోవై జిల్లా, మరుదమలై పశ్చిమ శ్రేణి పర్వత ప్రాంతం. ఇక్కడ గత కొన్ని రోజులుగా సుమారు 11 ఏనుగులు నివాస ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఈ ఏనుగులు ఆహారం, నీరు కోసం రాత్రి వేళల్లో ప్రజల నివాస ప్రాంతంలోకి వస్తున్నాయి. 
 
ఆ విధంగా వచ్చే ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తిరిగి పంపేందుకు అటవీశాఖా అధికారులు సిద్ధంగా వుంటారు. ఈ నేపథ్యంలో నిన్న శనివారం రాత్రి, మరుదమలై సమీపంలో ఉన్న భారతీయర్ విశ్వవిద్యాలయం సమీపంలోని నివాస ప్రాంతంలో సాయంత్రం వాకింగ్ వెళ్లిన దంపతులు అడవి ఏనుగును చూసి షాకయ్యారు. వెంటనే ఆ దంపతులు ఇంట్లోకి పరుగులు పెట్టారు. ఆపై ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఏస్ ఆమ్రపాలిపై తెలంగాణ సర్కారుకు ఎందుకో అంత ప్రేమ?