Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారం.. విదేశీ వేదికలపై ఎండగడతాం

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (16:01 IST)
భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారాన్ని తీవ్రతరం చేయనుంది. 1960 ఇండస్ వాటర్స్ ట్రీటీకి సంబంధించి భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారాన్ని తీవ్రతరం చేయనుంది. జమ్మూకాశ్మీర్‌లోని రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులను పాకిస్థాన్ అధికారులు సందర్శించేందుకు భారత్ అనుమతించకపోవడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
జమ్ముకాశ్మీర్‌లోని పాకల్ దూల్, లోయర్ కల్నాయ్ ప్రాజెక్టుల సందర్శనకు అనుమతిస్తామని ఆగస్టు 29, 30 తేదీలలో జరిగిన సమావేశం సందర్భంగా ఇండియన్ వాటర్ కమిషనర్ హామీ ఇచ్చారని పాకిస్థాన్ ఇండస్ వాటర్ కమిషనర్ సయ్యద్ మెహర్ అలీషా చెప్పారు. కానీ జమ్మూకాశ్మీర్‌లో అక్టోబర్‌లో  జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా ఆ కార్యక్రమం వాయిదా పడిందన్నారు. 
 
కానీ తమ పర్యటన షెడ్యూల్‌ను రివైజ్ చేయడంలో భారత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ విషయమై లేఖలు రాసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం నేరుగా ఫోన్ కూడా చేశానని... అయినా సరైన సమాధానం రాలేదని అన్నారు. 
 
చీనాబ్ నది మీద నిర్మించిన ఈ ప్రాజెక్టులను తాము పరిశీలిస్తామనే నమ్మకం పోయిందని చెప్పారు. అలాగని భారత్‌పై ఎదురుదాడికి తాము దిగబోమని.. కానీ 1960 ఒప్పందానికి భారత్ ఏ విధంగా తూట్లు పొడుస్తుందనే విషయాన్ని విదేశీ వేదికలపై ఎండగడతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు: ప్రధాన నిందితుడు అరెస్ట్?

బక్కోడికి రజిని బండోడికి బాలయ్య - తమన్ డైలాగ్ వైరల్

గేమ్ చేంజర్ పైరసీ - ఏపీ లోక‌ల్ టీవీ అప్పల్రాజు అరెస్ట్

ఆకట్టుకున్న హరి హర వీరమల్లు పార్ట్-1 మాట వినాలి పాట విజువల్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments