Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైమానిక స్థావరాలే లక్ష్యంగా పాక్ ఉగ్రమూకల దాడికి ప్లాన్

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (15:24 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు భారత్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. ఇండోపాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడేందుకు ప్లాన్ వేసినట్టు సమాచారం. ఈ కుట్రకు జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. దీంతో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. 
 
ఈ దాడిలో భాగంగా, జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడుల చేసేందుకు పాక్ ఉగ్రవాదులు పథకాలను రచిస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ రెండు ఎయిర్‌బేస్‌ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసి హైఅలర్ట్ ప్రకటించారు. 
 
మరోవైపు, చారిత్రాత్మక ఇస్లామిక్ యుద్ధం 'బదర్'ను పురస్కరించుకుని జరుపుకునే వేడుకకు ముందే ఈ దాడి జరిగే అవకాశం ఉంది. మహమ్మద్ ప్రవక్త సాధించిన తొలి మిలిటరీ విజయమే బదర్. ఈ నెల 23న ఈ వేడుక జరగనుంది. పుల్వామా ఘటనకు పాల్పడిన జైషే మొహమ్మద్ ఈ దాడులకు స్కెచ్ వేసినట్టు ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈనెల 23వ తేదీనే దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments