Webdunia - Bharat's app for daily news and videos

Install App

దైవదూషణ చట్టానికి మరింత పదును.. బెయిల్ లేకుండా కేసు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (14:52 IST)
పాకిస్థాన్ పాలకులు దైవదూషణ చట్టానికి మరింత పదును పెట్టారు. ఇందులోభాగంగా, సవరించిన దైవ దూషణ చట్టానికి పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై ఈ చట్టం కింద కేసు నమోదైతే బెయిల్ కూడా లభించదు. అలాగే, గరిష్టంగా మరణశిక్షను కూడా విధిస్తారు. అలాగే, శిక్షతో పాటు లక్ష రూపాయల అపరాధం కూడా విధిస్తారు. 
 
ఇస్లాంను కానీ, మహ్మద్ ప్రవక్తను కానీ నిందించిన వారికి ప్రస్తుతం కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. అయితే, ఇకపై మహ్మద్ ప్రవక్తతో సంబంధం ఉన్న వ్యక్తులను అవమానించినా కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదు. ఈ మేరకు చట్టాన్ని సవరిస్తూ ప్రవేశపెట్టిన చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 
 
తాజాగా పాకిస్థాన్ పాలకులు సవరించిన చట్టం మేరకు... మహ్మద్ ప్రవక్త భార్యలపై, సహచరులపై, దగ్గరి బంధువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పదేళ్ల జైలు శిక్షను విధిస్తారు. అంతేకాకుండా, దానిని జీవిత ఖైదుగా కూడా మార్చే అవకాశం ఉంది. శిక్షతో పాటు లక్ష రూపాయల అపరాధం కూడా విధిస్తారు. 
 
దైవదూషణ కేసు నమోదైతే బెయిలు పొందే అవకాశమే లేదు. నిజానికి ఇప్పటివరకు మహ్మద్ ప్రవక్త బంధువులను విమర్శించిన వారికి ఇప్పటివరకు ఎలాంటి శిక్షలు లేవు. ఈ నేపథ్యంలో సవరించిన దైవదూషణ చట్టంతో ఇకపై ఈ శిక్షలు కూడా అమలు చేయనుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments