Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్ముందు పరిస్థితి మరింత దిగజారవొచ్చు... ఇమ్రాన్ ఖాన్

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (18:08 IST)
కరోనా వైరస్ కారణంగా తమ దేశంలో పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని పాకిస్థాన్ అధ్యక్షుజు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. కరోనా వైరస్ బారినపడిన దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో తీవ్రపోరాటం చేస్తున్నా పాకిస్థాన్‌లో కరోనా కేసులు సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ కేసులు నాలుగు వేలకు పైగా పెరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, మున్ముందు ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టమేనని, పరిస్థితి మరింత దిగజారవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాక్‌లో పాక్షికంగానే లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దేశంలో 5 కోట్లకు పైగా పేదలున్న నేపథ్యంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తే ఆకలి చావులు సంభవిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ప్రజలు ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలని హితవు పలికారు. కాగా, పాకిస్థాన్‌లో కరోనా తీవ్రతతో సామాన్యులు ఇక్కట్లు ఎదుర్కొంటుండటంతో ప్రభుత్వం 'ఎహసాస్ ఎమర్జెన్సీ క్యాష్ ప్రోగ్రామ్' ప్రకటించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments