Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో వరద బీభత్సం - ఎటు చూసినా వరద నీరే...

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (13:38 IST)
పాకిస్థాన్‌ దేశంలో వరదలు భారీ ముంచెత్తాయి. గత మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశాన్ని వరదలు తాకాయి. ఈ వరద నీటి ప్రవాహం దెబ్బకు అనేక ప్రాంతాల్లో దాదాపు 150కిపైగా వంతెనలు కొట్టుకునిపోయాయి. అలాగే, వెయ్యిమందికిపైగా వరద బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో పాకిస్థాన్‌కు సాయం అందించేందుకు ఖతర్, ఇరాన్ వంటి దేశాలు ముందుకు వచ్చాయి. 
 
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో భారీ వదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 1033 మంది చనిపోయినట్టు పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత 24 గంటల్లోనే 119 మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. అలాగే, ఈ వరదల కారణంగా 1500 మంది వరకు గాయపడినట్టు పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 
 
పాకిస్థాన్ దేశంలో ఈ తరహాలో వర్షాలు కురవడం, వరదలు సంభవించడి గత 30 యేళ్ళలో ఇది తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా పాక్‌లో సగటు వర్షపాతం 132.3 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఈ యేడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఏకంగా 385 మిల్లీ మీటర్ల వర్షంపాతం నమోదైంది. 
 
ఈ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఫలితంగా దాదాపు 3.30 కోట్ల మంది వరద బాధితులయ్యారని వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments