నియంత్రణ రేఖ దాటొచ్చిన పాకిస్థాన్‌ సైన్యానికి భారత్ చేతిలో చావుదెబ్బ!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (15:51 IST)
శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కవ్వింపులకు తెరలేపింది. నియంత్రణ రేఖ దాటొచ్చి మరీ దురాగతానికి పాల్పడింది. ఆ వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు.. పాకిస్థాన్ సైనికుల ఆటకట్టించారు. పాక్ సైన్యం చేసిన చొరబాటు యత్నాలను భారత సైన్యం సమర్థవంతంగా భగ్నం చేసింది. దాయాది దేశం సైన్యం కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఎల్‌వోసీ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు యత్నించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ నెల ఒకటో తేదీన కృష్ణఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని తెలిపాయి. ఈ నేపథ్యంలో అక్కడ మందుపాతర పేలిన ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత పాక్ సైన్యం కాల్పులు జరిపి, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు పేర్కొన్నాయి. అందుకు ధీటుగా భారత సైనిక బలగాలు ధీటుగా స్పందించాయి. ఈ ఘటనలో ఐదుగురు చొరబాటుదారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరోవైపు, భారత్ వైపు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. 
 
కాగా, గత రెండు నెలలుగా నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాలు, కాల్పులు ఘటనలు గణనీయంగా పెరిగాయి. ఉగ్రవాదులతో కలిసి పాకిస్థాన్ సైన్యం అనేకసార్లు చొరబాటుకు యత్నించినప్పటికీ భారత సైన్యం ఆ చొరబాట్లను తిప్పికొట్టింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments