Chirajeevi wishess sunita
భారతీయ మహిళా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ నేటి తెల్లవారిజామున భూమికి సేఫ్ గా తిరిగి రావడంపై పలువురు భారతీయ ప్రముఖులు స్వాగతంతో శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధానికూడా ఓసారి భారత్ కు రావాలని ఆకాక్షించారు. ఇక తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన దైన శైలిలో ట్వీట్ చేశారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై సంతోషం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి.
8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు బ్లాక్ బస్టర్ సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలి. మళ్ళీ భూమి మీదకి వచ్చినందుకు సునీతకు వెల్కమ్ చెప్పారు. ఇదొక నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ అంటూ మెగాస్టార్ తనదైన శైలిలో పోస్ట్ చేయడం ఇపుడు వైరల్ గా మారింది.
కొన్నాళ్ల కితం నాసా(నేషనల్ ఆరోనెటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) వారు స్టార్ లైనర్ కాప్సూల్ కోసం క్రీవ్ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ కి మన భారతీయ మహిళా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తోపాటు అమెరికా నుంచి బుచ్ విల్మోర్ లని ఒక వారం రోజుల మెషిన్ కోసం గత ఏడాది జూన్ 5న పంపడం జరిగింది. ఆ తర్వాత టెక్నికల్ కారణాలతో అక్కడ సుమారు 9 నెలల పాటుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు నేడు ఫ్లోరిడా తీరంలో తెల్లవారు జామున సేఫ్ గా ల్యాండ్ అవ్వడం జరిగింది.