Webdunia - Bharat's app for daily news and videos

Install App

నియంత్రణ రేఖ దాటొచ్చిన పాకిస్థాన్‌ సైన్యానికి భారత్ చేతిలో చావుదెబ్బ!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (15:51 IST)
శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కవ్వింపులకు తెరలేపింది. నియంత్రణ రేఖ దాటొచ్చి మరీ దురాగతానికి పాల్పడింది. ఆ వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు.. పాకిస్థాన్ సైనికుల ఆటకట్టించారు. పాక్ సైన్యం చేసిన చొరబాటు యత్నాలను భారత సైన్యం సమర్థవంతంగా భగ్నం చేసింది. దాయాది దేశం సైన్యం కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఎల్‌వోసీ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు యత్నించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ నెల ఒకటో తేదీన కృష్ణఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని తెలిపాయి. ఈ నేపథ్యంలో అక్కడ మందుపాతర పేలిన ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత పాక్ సైన్యం కాల్పులు జరిపి, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు పేర్కొన్నాయి. అందుకు ధీటుగా భారత సైనిక బలగాలు ధీటుగా స్పందించాయి. ఈ ఘటనలో ఐదుగురు చొరబాటుదారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరోవైపు, భారత్ వైపు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. 
 
కాగా, గత రెండు నెలలుగా నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాలు, కాల్పులు ఘటనలు గణనీయంగా పెరిగాయి. ఉగ్రవాదులతో కలిసి పాకిస్థాన్ సైన్యం అనేకసార్లు చొరబాటుకు యత్నించినప్పటికీ భారత సైన్యం ఆ చొరబాట్లను తిప్పికొట్టింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments