Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొజాంబిక్ తీరంలో విషాదం.. పడవ మునిగి 90 మంది జలసమాధి!!

వరుణ్
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (11:42 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు జలసమాధి అయ్యారు. జాలర్లు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో 90 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో పడవలో సామర్థ్యానికి మించి 130 మంది వరకు ఉన్నట్టు సమాచారం. బోటులో కెపాసిటీకి మించి జాలర్లు ఉండటం వల్లే ఈ ఘోరం జరిగినట్టు సమాచారం. అయితే, మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడం వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ దుర్ఘటం గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన తీరానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, కలరా వ్యాప్తి అంటూ వదంతుల నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళుతున్నట్టు నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళుతుండగా ఈ పడవ మునిగిందని చెబుతున్నారు. ఇదిలావుంటే, మొజాంబిక్ దేశంలో గత యేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు 15 వేల కలరా కేసులు వెలుగు చూశాయి. అలాగే, 32 మంది మృత్యువాతపడినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments