Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్ యుద్ధంలో చిక్కున్న భారతీయ విద్యార్థులు...

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (17:58 IST)
హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. భీకర దాడులు చేసింది. ఈ యుద్ధంలో భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. భారత విదేశాంగ వర్గాల ప్రకారం ఈ యుద్ధం కారణంగా దాదాపు 18 వేల మంది విద్యార్థులు చిక్కుకున్నారని, వీరి రక్షణపై భారత అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 
 
మరోవైపు, ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడిపై విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ, శనివారం రాత్రి వరకు మాకు చాలా సందేశాలు వచ్చాయి. వీటిని రాత్రంతా సేకరిస్తూనే ఉన్నాం. ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు ప్రధానిమంత్రి సైతం పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. అదేసమయంలో ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులంతా సురక్షితంగా ఉండాలని సూచించారు. 
 
అయితే, భారతీయ విద్యార్థులు మాత్రం భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొందరు విద్యార్థులను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య కాల్పులు భీకర కాల్పులు జరుగుతుండటంతో పరిస్థితి భీకరంగా కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments