Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫీస్ పార్టీలో 10 నిమిషాల్లో లీటర్ మద్యం తాగిన ఉద్యోగి.. తర్వాత ఏమైంది...

drinker
, గురువారం, 5 అక్టోబరు 2023 (17:05 IST)
తాను పని చేసే కార్యాలయంలో జరిగిన పార్టీ సహచరులతో పందెం కాసి కేవలం పది నిమిషాల్లో లీటర్ మద్యాన్ని సేవించాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన చైనాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల చైనాలోని ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులు కూడా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మద్యం తాగే ముందు కంపెనీ బాస్, ఉద్యోగుల మధ్య పందెం ప్రస్తావన  తెచ్చాడు. బాస్ యాంగ్ ఉద్యోగులతో పందెం కాసాడు. ఒక లీటర్ మద్యాన్ని 10 నిమిషాల్లో తాగిన వారికి రూ.5 వేల యువాన్‌లు భారత కరెన్సీలో రూ.58 వేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. దీనికి ఎవరూ స్పందించలేదు. దీంతో బాస్.. బహుమతి మొత్తాన్ని రూ.10 వేల యూవాన్‌లకు పెంచినప్పటికీ ఉద్యోగుల నుంచి  స్పందన రాలేదు. 
 
చివరకు రూ.20 వేల యువాన్‌లు ప్రకటించడంతో ఝాంగీ అనే ఉద్యోగి ఈ పందెంకు అంగీకరించాడు. లీటర్ మద్యం బాటిల్ సీల్ తీసిన గటగటామని 10 నిమిషాల్లో తాగేశాడు. మద్యాన్ని పూర్తిగా సేవించిన తర్వాత ఝాంగా స్మృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్, ఆస్పిరేషన్ న్యూమోనియా, ఉపిరాడకపోవడం, కార్డియాక్ అరెస్ట్ వంటి కారణాలతో అతను మరణించివుంటాడని వైద్యులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నూతన హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించిన గోల్డ్‌మన్ సాచ్స్