Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు.. ఐసోలేషన్‌లో 1,87,800 మంది

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:00 IST)
ఉత్తర కొరియా దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడని కరోనా వైరస్ తాజాగా వెలుగు చూసింది. ఆ దేశంలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో 1,87,800 మందిని ఐసోలేషన్‌లోకి పంపించారు. అలాగే, జ్వరం కారణంగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో నార్త్ కొరియా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జ్వరంలో చనిపోయిన ఆరు మృతదేహాలకు వైద్య పరీక్షలు చేయగా, అందులో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మృతదేహంలో ఒమిక్రాన్ బీఏ-2ను గుర్తించారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా 1,87,800 మంది జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటికే నార్త్ కొరియాలో అత్యవసర పరిస్థితితో పాటు లాక్డౌన్ విధించారు. 
 
ఉత్తర కొరియా వాసుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా టీకా వేసుకోలేదు. వారికి టీకాలు సరఫరా చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చినప్పటికీ నార్త్ కొరియా అధిపతి కిమ్ జాంగ్ ఉన్ వద్దని తిరస్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments