ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు.. ఐసోలేషన్‌లో 1,87,800 మంది

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:00 IST)
ఉత్తర కొరియా దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడని కరోనా వైరస్ తాజాగా వెలుగు చూసింది. ఆ దేశంలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో 1,87,800 మందిని ఐసోలేషన్‌లోకి పంపించారు. అలాగే, జ్వరం కారణంగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో నార్త్ కొరియా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జ్వరంలో చనిపోయిన ఆరు మృతదేహాలకు వైద్య పరీక్షలు చేయగా, అందులో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మృతదేహంలో ఒమిక్రాన్ బీఏ-2ను గుర్తించారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా 1,87,800 మంది జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటికే నార్త్ కొరియాలో అత్యవసర పరిస్థితితో పాటు లాక్డౌన్ విధించారు. 
 
ఉత్తర కొరియా వాసుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా టీకా వేసుకోలేదు. వారికి టీకాలు సరఫరా చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చినప్పటికీ నార్త్ కొరియా అధిపతి కిమ్ జాంగ్ ఉన్ వద్దని తిరస్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments