Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... 12 మంది అరెస్టు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:52 IST)
చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను ఆ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనందుంగల విలువ రూ.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఈ దుంగలను తరలిస్తున్నందుకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ బాగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున ఎర్ర చందనం పట్టుబడుతుంది. 
 
మంగళవారం చిత్తూరు నుంచి తమిళనాడుకు తరలిపోతున్న రూ.3 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తమిళనాడుకు చెందిన గోవిందస్వామి, మురుగేశన్, పెరుమాళ్ వెంకటేష్, కరియ రామన్, కలంజన్, వెంకటేష్ ఆర్. గోవిందరాజులు అనే వారిని అరెస్టు చేశారు. 
 
మరో ఘటనలో తిరుపతి నుంచి చిత్తూరుకు వెళుతున్న ఒక మినీ వ్యానును తనిఖీ చేయగా, అందులో రూ.4 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దేవన్ అలియాస్ నాగరాజ్, వైద్యలింగం, నజీర్ బాషా, ముత్తురామన్‌ అనే వారిని అరెస్టు చేశారు. ఈ స్మగ్లింగ్‌కు సూత్రధారిగా భావిస్తున్న సెంథిల్ కుమార్ అనే బడా స్మగ్లర్ పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments