Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్‌ చిత్రపటానికి మద్యంతో అభిషేకం..

సీఎం జగన్‌ చిత్రపటానికి మద్యంతో అభిషేకం..
, సోమవారం, 21 మార్చి 2022 (11:29 IST)
ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్షం నిరసనలు చేపడుతోంది. 
 
సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వ‌ర‌కు టీడీపీ శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసి వారి నిరసన తెలిపారు. 
 
ఈ ర్యాలీలో పాల్గొన్న నారా లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో మ‌ద్యం ఏరులైపారుతోందంటూ విమ‌ర్శించారు. దాని వ‌ల్ల‌ వందలాది మంది చనిపోతున్నారని ఆరోపించారు. మద్య నిషేధంపై ఇచ్చిన హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు.
 
ఏపీలో కరోనా కంటే ఎక్కువగా కల్తీసారాతో చనిపోయారని  నారా లోకేష్ మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రూ.25 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ విదేశాంగ విధానం సూపర్బ్ : పాక్ ప్రధాని ప్రశంసలు