Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా వద్దన్న పాపానికి అమ్మనే చంపేశాడు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (13:38 IST)
స్మార్ట్ ఫోన్లపై నేటి యువతకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే పిజ్జాలు, బర్గర్లు అంటే తెగ ఇష్టపడుతున్నారు. తమకు కావలసిన వస్తువులు, ఆహార పదార్థాల కోసం యువత దేనికైనా సిద్ధపడుతున్నారు. వద్దంటే తల్లిదండ్రులతో గొడవపడుతున్నారు. కానీ ఇక్కడొకడు పిజ్జా ఆర్డర్ చేసుకుంటానంటే తల్లి వద్దని చెప్పిందని.. ఆమెను హతమార్చాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన నళిని (51) భర్త, కుమారుడితో కలిసి అమెరికాలోని నార్త్ కరోలోనాలో స్థిరపడ్డారు. నళిని కుమారుడు ఆర్నవ్.. చెడు అలవాట్లకు బానిసగా మారాడు. దీన్ని గమనించిన నళిని అతని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. దీన్ని తెలుసుకున్న ఆర్నవ్ తల్లిని శత్రువుగా చూడటం మొదలెట్టాడు. ఆమెపై పగను పెంచుకున్నాడు.
 
ఓసారి పిజ్జా వద్దని చెప్పినా ఆర్డర్ చేశాడని ఆర్నవ్‌ను నళిని కోపంతో చెంపపై కొట్టింది. దీంతో ఆవేశానికి గురైన ఆర్నవ్ ఆమెను గొంతు నులిమి హతమార్చాడు. ఆస్పత్రికి ఆర్నవ్ తీసుకెళ్లలేకపోవడంతో నళిని ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై మైనర్ కావడంతో ఇన్నాళ్లు కేసు నమోదు చేయని పోలీసులు.. గత ఏడాది అభియోగాలు నమోదు చేశారు. ఇంకా ఆర్నవ్ తల్లిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments