Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనికి మాలిన పీజీలు - పీహెచ్‌డీలు ఎందుకు? ఆప్ఘన్ విద్యామంత్రి

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (14:27 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తమ వశం చేసుకున్న తాలిహన్ తీవ్రవాదులు ఆ దేశంలో కఠినమైన షరియా చట్టాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం ఆ మేరకు సంకేతాలు పంపించింది. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ కొత్త విద్యా మంత్రి షేక్ మౌల్వీ నూరుల్లా మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ పీహెచ్‌డీలు, మాస్ట‌ర్ డిగ్రీలు ఎందుకూ ప‌నికి రావ‌ని కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం.
 
ముల్లాల‌కు ఆ డిగ్రీలేమైనా ఉన్నాయా? అయినా వాళ్లే అంద‌రి కంటే గొప్ప‌వాళ్లు అని నూరుల్లా అన్నాడు. ఇప్పుడు ఏ పీహెచ్‌డీ డిగ్రీకి, మాస్ట‌ర్ డిగ్రీకి విలువ లేదు. ముల్లాలు, తాలిబ‌న్ లీడ‌ర్ల‌కు ఈ డిగ్రీలు కాదు క‌దా క‌నీసం హైస్కూల్ డిగ్రీ కూడా లేదు. కానీ వాళ్లే ఇప్పుడు గొప్ప‌వాళ్లు అని అత‌డు అన్నాడు.
 
ముల్లా హ‌స‌న్ ప్ర‌ధానిగా మంగ‌ళ‌వారం తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్థాన్‌లో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఓ ఉగ్ర‌వాది స‌హా 33 మంది మంత్రులు తాలిబ‌న్ల కేబినెట్‌లో ఉన్నారు. షరియా చ‌ట్టం ప్ర‌కారమే త‌మ పాల‌న ఉంటుంద‌ని వాళ్లు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments