నేపాల్‌లో కుప్పకూలిన విమానం.... 18 మంది దుర్మరణం

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (16:23 IST)
నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం టేకాఫ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆ సమయంలో విమానంలో 19 మంది ఉండగా, వీరిలో 18 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం ఉదంయ 11 గంటల సమయంలో జరిగింది. ఈ విమానం... ఖాట్మండు నుంచి పోఖారాకు వెళ్లేందుకు టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలియగానే ప్రమాదస్థలికి పోలీసులు, అగ్నిమాపదక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు చలరేగడంతో ఆర్పివేశారు. 
 
అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను వెలికి తీశారు. విమానం పైలెట్ కెప్టెన్ మనీష్ షాక్యాను రక్షించిన సిబ్బంది.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. టేకాఫ్ సమయంలో్ రన్‌వే పై నుంచి విమానం జారిపోవడం వల్లే కూలిపోయివుంటుందని శౌర్య ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments