Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేపాల్‌: టేకాఫ్ అవుతున్న విమానం కూలిపోయింది.. 18మంది మృతి (video)

Nepal plane crash

సెల్వి

, బుధవారం, 24 జులై 2024 (15:22 IST)
నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. కాట్మండు నుంచి పొఖారాకు బయల్దేరిన బాంబార్డియర్ సీఆర్జే 200 విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి.
 
ఈ ప్రమాదం సమయంలో విమాన సిబ్బందితో సహా 19మంది వుండగా.. 18మంది ప్రాణాలు విడిచారు. పైలట్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఐదేళ్ల విధ్వంస సంకెళ్లను ఏపీ తెంచుకుంది : మంత్రి సత్యకుమార్