Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరికొన్ని గంటల్లో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకలు.. దేశ వ్యాప్తంగా ముస్తాబైన నగరాలు

Advertiesment
beatufication

వరుణ్

, ఆదివారం, 21 జనవరి 2024 (13:19 IST)
అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో అందంగా ముస్తాబు చేశఆరు. ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేపాల్‌లోని జనక్ పూర్ కూడా ఈ వేడుకలు జరుగనున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో వేల దీపాలతో రామనామం రాశారు. 
 
అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీపాల కాంతుల్లో నగరం మెరిసిపోతుంది. రామ మంది ప్రవేశ ద్వారాన్ని పూలతో అందంగా అలంకరించారు. వీధుల్లో తారణాలు, గోడలపై రామాయణ గాథను తెలిపే చిత్రాలతో అయోధ్య నగరం మెరిసిపోతుంది. 
 
కాగా, అయోధ్యతో పాటు దేశవిదేశాల్లోనూ సంబరాలు జరుగుతున్నాయి. అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకలకు దేశ వ్యాప్తంగా పలు నగరాలు కూడా ముస్తాబయ్యాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పలుచోటు ఏర్పాటు చేసిన లైట్‌ షోలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
 
మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో వేలాది దీపాలతో సియావర్ రామచంద్ర కీ జై అంటూ నినాదాలు రాశారు. చాందా క్లబ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీమాతా వైష్ణో దేవి ఆలయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతుంది. శ్రీరాముడి అత్తారిళ్లు నేపాల్‌‍లో జనక్ పూర్‌లోనూ సంబరాలు జరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య గర్భగుడిలోకి సూర్య కిరణాలు.. ఎలా సాధ్యం?