Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా అధినేతతో కలిసి నరేంద్ర మోడీ పడవ షికారు.. ఎక్కడ?

ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు చైనా పర్యటనకు వెళ్లారు. ఆయన శుక్ర, శనివారాల్లో వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం చైనాలోని వూహాన్‌లో ఉన్న నరేంద్ర మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కల

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (12:43 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు చైనా పర్యటనకు వెళ్లారు. ఆయన శుక్ర, శనివారాల్లో వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం చైనాలోని వూహాన్‌లో ఉన్న నరేంద్ర మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కలిసి ముఖాముఖి చర్చలు జరుపుతారు. అలాగే, భారత్, చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక, అంతర్జాతీ అంశాలతో పాటు.. అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఉత్పన్నమవుతున్న ఉద్రిక్తతలపై కూడా చర్చకు రానున్నాయి.
 
ముఖ్యంగా, భారతదేశం - చైనా మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా కొనసాగుతున్న సమస్యలపై వీరిద్దరూ మనసారా మాట్లాడుకుంటారని అధికార వర్గాలు చెప్పాయి. అలాగే, డోక్లాంలో చైనా - భారత్ మధ్య 73 రోజులపాటు ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ అనధికార భేటీకి చాలా ప్రాధాన్యం ఉంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మ, దీర్ఘకాలిక ప్రాతిపదికపై చర్చలు జరుగుతాయి. 
 
మరోవైపు చాలా ఆనందకరమైన వాతావరణంలో వీరిద్దరి సంభాషణలు జరుగుతాయి. పడవలో షికారు చేస్తూ, ఈస్ట్ లేక్ సరస్సు తీరంలో వాహ్యాళి చేస్తూ మాట్లాడుకుంటారు. చైనాలోని సుప్రసిద్ధ మ్యూజియంను కూడా ప్రధాని మోడీ సందర్శిస్తారు. సుందర సరస్సు తీరంలో విందు సమావేశం జరుగుతుంది. ఈ సమయంలో వీరిద్దరితోపాటు ఇతర అధికారులు ఉండరు, కేవలం దుబాసీలు మాత్రమే ఉంటారు. వీరు ఒకరి మాటలను మరొకరికి అనువాదం చేసి వినిపిస్తారు. మొత్తంమీద నరేంద్ర మోడీ ఈ చైనా పర్యటన సరికొత్త శకానికి నాందిపలుకనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments