మలేరియా మందు కరోనాకు వాడకూడదు.. అధిక మరణాలు తప్పవట..

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:49 IST)
భారత్ నుంచి తెప్పించుకున్న మలేరియా మందు.. అమెరికాకు పనిచేసేలా లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి ఈ మందును తెప్పించేందుకు ప్రతీకారం వరకు వెళ్లారు. ఆ మందు పేరు హైడ్రాక్సీక్లోరోక్విన్. అది మలేరియా మందు. దానిని అజిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్‌తో కలిపి వాడితే కరోనాకు చెక్ పెట్టవచ్చునని అనుకున్నారు. కానీ కరోనా రోగం కుదరడం మాటేమోగానీ కథ అడ్డం తిరిగింది. 
 
అమెరికా అంటువ్యాధుల విభాగం నియమించిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ వాడరాదని సిఫారసు చేసింది. ఔషధ పరీక్షలకు తప్ప మరి దేనికీ దీనిని వాడొద్దని స్పష్టం చేసింది. కానీ హైడ్రాక్సీక్లోరోక్విన్ లేదా మరో క్లోరోక్విన్ వాడకం గురించి ఏమీ చేల్చలేదు. అనుకూలంగా లేదా వ్యతిరేకంగా చెప్పడానికి తగినంత సమాచారం లేదని కమిటీ పేర్కొన్నది. ఒకవేళ ఆ మందు వేసేటట్టయితే ప్రతికూల ప్రభావాల కోసం పేషంటును పరిశీలించాలని నొక్కిచెప్పింది. 
 
ఈ కమిటీని అమెరికా అధ్యక్షుని సలహాదారైన ఆంటోనీ ఫాసీ నియమించారు. కాగా మంగళవారం ప్రచురితమైన ఓ విశ్లేషణ నివేదిక అమెరికా వెటరన్ అఫేర్స్ హాస్పిటల్స్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వడం వల్ల ప్రయోజనాలు లేకపోగా అధిక మరణాలు సంభవించాయని హెచ్చరించడం గమనార్హం. కానీ దీనిపై లోతైన పరిశోధన జరగాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments