Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో భారత సంతతి యువతి శవమై తేలింది.. డిసెంబరులో మిస్సై..?

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (13:44 IST)
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. గత నెల డిసెంబర్ 27న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలోని భారతీయ సమాజంలో విషాదం నెలకొంది. గత డిసెంబరులో కనిపించకుండాపోయిన సురీల్ దాబావాలా అనే 33 ఏళ్ల యువతి శవమై తేలింది. 
 
చికాగోలోని లయోలా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సురీల్ డిసెంబరు 30న అదృశ్యమైంది. ఆమె తండ్రి అష్రాఫ్ దాబావాలా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా తన కుమార్తె ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల రివార్డు కూడా ప్రకటించారు.
 
తాజాగా, తన సొంత కారులోనే విగతజీవిగా పడివున్న సురీల్‌ను ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ గుర్తించింది. చికాగో పరిసరాల్లో కారు డిక్కీలో సురీల్ మృతదేహం దుప్పట్లో చుట్టి ఉంది. సురీల్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments