Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేగి తుఫాను బీభత్సం - 25 మంది మృతి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (12:18 IST)
ఫిలిప్పీన్స్‌లో మేగి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ బీభత్సం దెబ్బకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపుగా 25 మంది చనిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ తుఫాను కారణంగా తూర్పు, దక్షిణ తీరాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మేగి తుఫాను ప్రభావం కారణంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లో ప్రతి యేడాది కనీసం 20 ఉష్ణ తుఫాన్లు వస్తుంటాయి. 
 
తూర్పు తీరంపై మేగి తుఫాను విరుచుకుపడటంతో సుమారు 13 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. భారీ వర్షాలు, గాలులు వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ వరదల కారణంగా అనేక గృహాలు నీట మునిగాయి. కొండ చరియలు విరిగిపడటం వల్ల అనేక గ్రామాల్లోకి బురదమట్టి వచ్చి చేరింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments