Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

సెల్వి
బుధవారం, 7 మే 2025 (17:35 IST)
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ సిందూర్' కింద జరిపిన ప్రతీకార దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ అంగీకరించారు. 
 
ఈ దాడులు పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాహ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. మరణించిన వారిలో తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, వారి కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని మసూద్ అజార్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
 
1994లో భారతదేశంలో అరెస్టు చేయబడి, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 హైజాక్ తర్వాత మసూద్ అజార్ విడుదలైనాడు. ఇతడు ఆపరేషన్ సింధూర్‌పై మాట్లాడుతూ.. "ఈ రాత్రి, నా కుటుంబంలోని పది మంది సభ్యులు శోకాన్ని అనుభవించారు. వారిలో ఐదుగురు అమాయక పిల్లలు, నా అక్క, ఆమె గౌరవనీయ భర్త, నా మేనల్లుడు ఫాజిల్, అతని భార్య, నా ప్రియమైన మేనకోడలు (ఫాజిలా), నా ప్రియమైన సోదరుడు హుజైఫా, అతని తల్లి, మరో ఇద్దరు ప్రియమైన సహచరులు ఉన్నారు" అని తెలిపాడు.
 
మరణించిన వారు అల్లాహ్ యొక్క దైవిక ఆస్థానంలో అతిథులుగా మారారని "నాకు ఎటువంటి దుఃఖం లేదా నిరాశ అనిపించడం లేదు. నిజానికి, పద్నాలుగు మంది యాత్రికుల ఈ ఆనందకరమైన సమూహంలో నేను చేరాలని నా హృదయం కోరుకుంటూనే ఉంది." అని తెలిపాడు. 
 
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించబడిన 56 ఏళ్ల మసూద్ అజార్, 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా బాంబు దాడితో సహా భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడులలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments