Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆందోళన ఎక్కువై కిలోల కొద్దీ రాళ్లు, బోల్ట్‌లు తినేశాడు..

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (18:32 IST)
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పరిస్థితుల ప్రభావాల వల్ల మనిషి జీవనంలో రోజు రోజుకు ఆందోళన, కంగారు పెరిగిపోతున్నాయి. వాటిని అధిగమించేందుకు కొందరు నచ్చిన ప్రదేశాలకు వెళ్తుంటారు, మరికొంత మంది ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటం వంటివి చేస్తుంటారు. కొందరు సంగీతం వింటారు.


మరికొందరు పుస్తకాలు చదువుతారు. కానీ కొరియాలో ఒక వ్యక్తి ఎవరూ ఊహించలేని విధంగా సొంత వైద్యం చేసుకున్నాడు. అది కాస్తా ప్రాణాల మీదకు వచ్చేసరికి వైద్యుల వద్దకు పరుగులు తీశాడు.
 
వివరాలల్లోకెళితే, కొరియాకు చెందిన ఒక వ్యక్తి కొన్నేళ్లుగా ఆందోళనతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి చిన్న సంఘటనలకు, విషయాలకు తీవ్రంగా ఆందోళనకు గురవ్వడంతో ఏమి చేయాలో తెలియక ఇంట్లో ఏ చిన్న వస్తువు కనబడ్డా వాటిని మింగేవాడు. కొన్నాళ్ల పాటు ఇలా చేసాడు. ఈ క్రమంలో మనిషి అరుగుదల వస్తువులను చూర్ణం చేసే శక్తి లేకపోవడంతో పొట్ట ఉబ్బరంగా అయిపోయి నొప్పి ఎక్కువైంది. 
 
నొప్పి తట్టుకోలేక డాక్టర్‌ను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు పొట్టలో రెండు కిలోల రాళ్లు, పిన్నులు, బోల్టులు, మూతలు, రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా వాటిని నోటి గుండా తొలగించడానికి ప్రయత్నం చేసారు. ఎక్కువ మొత్తంలో వస్తువులు ఉండగా అలా చేయడం వీలు కాకపోయే సరికి మరో మార్గం లేక సర్జరీ ద్వారా వాటన్నింటినీ తొలగించారు. 
 
పెయాంగ్ వాహ్ అనే వైద్యుడు ఈ విషయాన్ని తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేర్ రిసార్ట్స్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేసారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments