Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియురాలిని చంపిన వ్యక్తికి పరిహారం... ఎవరు.. ఎక్కడ?

ప్రియురాలిని చంపిన వ్యక్తికి పరిహారం... ఎవరు.. ఎక్కడ?
, సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:50 IST)
నిందితునిగా 39 సంవత్సరాలు జైల్లో గడిపినందుకు పరిహారంగా కాలిఫోర్నియా ప్రభుత్వం ఓ వ్యక్తికి రోజుకు 140 డాలర్లు (రూ.9,500పైగా) ప్రకటించింది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడని రుజువుకావడంతో ప్రభుత్వం ఇలా చేసింది. 40 సంవత్సరాల క్రితం తన ప్రియురాలిని మరియు తన నాలుగేళ్ల కొడుకుని దారుణంగా హత్య చేసాడని నింద ఆరోపించబడి అతడిని అరెస్ట్ చేశారు. 
 
కానీ అతను తాను ఈ హత్యలు చేయలేదని ఎంత మొరపెట్టుకున్నా కోర్టు అతడిని నమ్మలేదు. దాంతో అతడిని దోషిగా నిర్ణయించి జీవిత ఖైదు విధించింది కోర్టు. కానీ ఆ వ్యక్తి తన పట్టు విడవలేదు. తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి కోర్టులో హంతకుడు కాదని నిరూపించుకున్నాడు. 
 
దాంతో పొరపాటున అతనికి శిక్ష విధించామని పశ్చాత్తాప్పడిన కాలిఫోర్నియా ప్రభుత్వం అతడికి జైల్లో గడిపినన్ని రోజులు రోజుకి 140 డాలర్లు చొప్పున ప్రకటించింది. లెక్క గట్టి 1.95 మిలియన్ డాలర్లు (రూ.14కోట్లకు పైగా) చెల్లించింది. దాంతో అతడు ఓ ఇల్లు కొనుక్కొని అందులో ఉంటున్నాడు. 
 
అతడు కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వలేమని భావించిన ఆ ప్రభుత్వం అతనికి ఇంకా సహాయం చేయాలనుకుంది. 21మిలియన్ డాలర్లు (150 కోట్లు) చెల్లిస్తామని ప్రకటించింది. అతడు కోల్పోయిన జీవితంతో పోలిస్తే ఇది చాలా చిన్న సహాయం అని పేర్కొంది. 71 ఏళ్ల క్రైగ్ ఆ డబ్బుతో తాను చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూస్తానని చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యునాని మెడికోతో ఫూటుగా తాగించి.. స్పృహ కోల్పోయాక.. ఆ ముగ్గురు..?