Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలిక పుర్రెను చీల్చేసిన మేకు.. సమర్థవంతంగా తొలగించిన వైద్యులు

బాలిక పుర్రెను చీల్చేసిన మేకు.. సమర్థవంతంగా తొలగించిన వైద్యులు
, బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:00 IST)
12 ఏళ్ల బాలిక పుర్రెను చీల్చేసిన ఓ మేకును వైద్యులు తొలగించి.. రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక పుర్రెలో మేకు గుచ్చుకుంది. దీంతో పుర్రె చీలింది. ఈ మేకును తొలగించడం కోసం వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మహారాష్ట్ర, బాల్కర్ జిల్లాలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది. 
 
ఆ భవనానికి సమీపంలో నడిచి వెళ్తున్న 12 ఏళ్ల బాలిక శాంతిని అనే బాలికపై కాంక్రీట్ ముక్క పడింది. ఆ కాంక్రీట్ ముక్కలోని మేకు బాలిక పుర్రెను 9మి.మి మేర చీల్చింది. దీంతో వెంటనే ఆ బాలికను ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. 
 
అలా బాలిక పుర్రెను చీల్చిన మేకును వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడిందని.. అయినప్పటికీ నెల రోజుల తర్వాత శాంతినికి మరో ఆపరేషన్ చేయాల్సి వుందని వైద్యులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తి కోసం భర్తపై సలసలకాగుతున్న నీళ్లు పోసిన ఇల్లాలు