Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌ను కలిపి అఖండ భారత్ ఏర్పాటు చేయాలి : ఇస్లామాబాద్‌లో ఫ్లెక్సీలు

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (17:01 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ప్రధాని మోడీ సర్కారు రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్ అంతటా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అదేసమయంలో ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా భారత్ అనుకూల ఫ్లెక్లీలు కూడా కనిపించాయి. పాకిస్తాన్‌తో కలుపుకుని అఖండ భారత్‌ను ఏర్పాటు చేయాలన్నది ఆ ఫ్లెక్సీలోని ప్రధాన సారాంశంగా ఉంది. దీంతో అప్రమత్తమైన పాక్ పోలీసులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారు. 
 
జమ్మూకాశ్మీర్ విషయంలో భారత చర్యలను పాకిస్థాన్‌లోని కొంతమంది గట్టిగా సమర్థిస్తున్నారు. వీటిని రుజువు చేసేలా భారత్‌కు అనుకూలంగా ఫ్లెక్సీలు దర్శనమివ్వడం సంచలనం రేకెత్తించింది. ఇస్లామాబాద్‌లోని ప్రెస్ క్లబ్, సెక్టార్ ఎఫ్-6, అబ్ పారా చౌక్ ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు కనిపించాయి. 'మహాభారత్ దిశగా ముందడుగు' అని బ్యానర్లో పేర్కొన్నారు. 
 
అంతేకాదు, అఖండ భారత్ లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి చేయాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బ్యానర్‌పై ప్రింట్ చేశారు. ఈ బ్యానర్లను స్థానికులు చాలా సేపు ఆసక్తికరంగా చూశారు. ఆ తర్వాత కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు వచ్చి ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని ప్రముఖ పత్రిక డాన్ ప్రచురించింది. మరోవైపు, దీనికి సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments