Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లడఖ్‌‌ క్రికెటర్లు జమ్మూకాశ్మీర్‌ జట్టుకు ఆడొచ్చు: రాయ్‌‌

Advertiesment
Vinod Rai
, బుధవారం, 7 ఆగస్టు 2019 (13:25 IST)
కొత్తగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) లడఖ్‌‌కు చెందిన ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్‌‌ ఆడే అవకాశం కల్పిస్తామని బీసీసీఐ కమిటీ ఆఫ్‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌ (సీఓఏ) హెడ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ తెలిపారు. లడఖ్‌‌ ప్లేయర్లు..  జమ్మూ కాశ్మీర్‌‌ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతిస్తామని చెప్పారు. ‘కొత్తగా ఏర్పాటైన లడఖ్‌‌ యూటీకి సపరేట్‌‌ క్రికెట్‌‌ బాడీని ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని స్పష్టం చేశారు.
 
ఈ ప్రాంతానికి చెందిన ప్లేయర్లు గతంలో మాదిరిగా బీసీసీఐ కాంపిటిషన్లలో జమ్మూ కాశ్మీర్‌‌కు ప్రాతినిథ్యం వహించొచ్చని తెలిపారు. మరో యూటీ పుదుచ్చేరి మాదిరిగా లడఖ్‌‌ను కూడా బీసీసీఐ ఓటింగ్‌‌ మెంబర్‌‌ను చేసే విషయం గురించి కూడా ఇప్పుడు చర్చలు జరపడం లేదన్నారు. 
 
జమ్మూ కాశ్మీర్‌‌లో ప్రస్తుత పరిస్థితి గురించి బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేయడం లేదని, త్వరలోనే అంతా సర్ధుకుంటుందన్నారు. గతేడాది మాదిరిగా జమ్మూ కాశ్మీర్‌‌ తన హోమ్‌‌ మ్యాచ్‌‌లను శ్రీనగర్‌‌లో ఆడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ ద్రవిడ్‌కి బీసీసీఐ నోటీసులు.... ఎందుకు?