Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి బృందం వెళ్తున్న పడవపై పిడుగుపాటు-18మంది మృతి

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (16:13 IST)
monsoon storms
బంగ్లాదేశ్‌లో విషాదం నెలకొంది. పెళ్లి బృందం వెళ్తున్న పడవపై పిడుగు పడింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. చపాయ్‌నవాబ్‌గంజ్‌ జిల్లా షిబ్‌గంజ్‌లోని తెలిఖారిఘాట్‌ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ పెళ్లి బృందం పద్మా నది ఒడ్డున పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్దానుకున్నారు. పడవలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఉన్నారు. మొత్తం 20 మందికి పైగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
పడవ బయలుదేరిన కాసేపటికే కుండ పోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపుతో వాతావరణం భీకరంగా మారింది. ఆ సమయంలోనే పద్మానదిలో వెళ్తున్న పడవపై పిడుగు పడింది. స్పాట్‌లోనే 18 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
 
పిడుగుపాటు వల్లే అందరూ చనిపోయారని.. పడవ నీటిలో మునిగేలోపే వారు మరణించారని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలనాకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో పెళ్లికొడుకు గాయపడగా, పెళ్లికూతురు సురక్షితంగా బయటపడిందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments