Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌లో భారీ పేలుడు - ముగ్గురి మృతి

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (19:07 IST)
పాకిస్థాన్ దేశంలోని ప్రముఖ నగరమైన లాహోర్‌లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి వద్ద గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది వరకు గాయపడినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం రావాల్సివుంది. 
 
ఈ ప్రమాదంలో లాహోర్ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎక్కువగా భారతీయ వ్యాపారులు వ్యాపారం చేసుకునే ఏరియా అని, అందుకే ఈ పేలుడుపై అనేక అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. 
 
నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌ను చేసుకుని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, ఘటనా ప్రాంతంలో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇదిలావుంటే, ఈ పేలుడు ఇప్పటివరకు ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ నైతిక బాధ్యత వహించలేదు. అయితే, పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఈ పేలుడు బైకులో అమర్చిన పేలుడు పదార్థాల వల్ల జరిగినట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments