Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి వీచే గాలుల వల్లే పాకిస్థాన్‌లో కాలుష్యం పెరిగిపోతుంది : పంజాబ్ మంత్రి

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (16:22 IST)
భారత్‌లోని పలు రాష్ట్రాలతో పాటు పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ అధ్వాన్నంగా తయారైంది. అయితే, పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం భారతదేశం నుంచి వీచే గాలులేనని పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి మరియం ఔరంగజేబ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వితండవాదం చేశారు.  
 
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ అట్టగుస్థాయికి పడిపోయింది. ఇక్కడ ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లు నమోదైంది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఓ మీడియాతో మాట్లాడారు. లాహోర్‌లో వాయు కాలుష్యం పెరగడానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్‌కు చేరుకుని ఏక్యూఐ దారుణంగా పెరిగిందని మండిపడ్డారు. 
 
లాహోర్‌లో ఏక్యూఐ 500 పాయింట్లకు కాస్త అటూ ఇటుగా ఉందని మరియం తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదన్నారు. భారత్ నుంచి వీచే గాలిని ఆపడం కుదరదని, ఆ దేశంతో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments