Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి వీచే గాలుల వల్లే పాకిస్థాన్‌లో కాలుష్యం పెరిగిపోతుంది : పంజాబ్ మంత్రి

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (16:22 IST)
భారత్‌లోని పలు రాష్ట్రాలతో పాటు పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ అధ్వాన్నంగా తయారైంది. అయితే, పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం భారతదేశం నుంచి వీచే గాలులేనని పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి మరియం ఔరంగజేబ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వితండవాదం చేశారు.  
 
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ అట్టగుస్థాయికి పడిపోయింది. ఇక్కడ ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లు నమోదైంది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఓ మీడియాతో మాట్లాడారు. లాహోర్‌లో వాయు కాలుష్యం పెరగడానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్‌కు చేరుకుని ఏక్యూఐ దారుణంగా పెరిగిందని మండిపడ్డారు. 
 
లాహోర్‌లో ఏక్యూఐ 500 పాయింట్లకు కాస్త అటూ ఇటుగా ఉందని మరియం తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదన్నారు. భారత్ నుంచి వీచే గాలిని ఆపడం కుదరదని, ఆ దేశంతో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments