Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనున్నానుగా అంటూ తుఫాను బాధిత ప్రాంతాల్లోకి వచ్చిన కిమ్ జోంగ్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:24 IST)
నేనెక్కడికి వెళ్తాను.. ఇదో వున్నానుగా.. అన్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్.. కెమెరా ముందుకు వచ్చారు. అప్పుడప్పుడు దక్షిణ కొరియా పాలనకు దూరమవుతూ.. ఒక్కోసారి జనాల కంటికి కనిపిస్తూ.. వచ్చే కిమ్ జోంగ్.. మళ్లీ కెమెరాకు చిక్కారు. 
 
కిమ్ కొన్ని రోజులు కనిపించలేదంటే చాలు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు షికారు చేస్తాయి. అంతేకాదు.. ఆయన ఉన్నాడా? చనిపోయాడా? అనే చర్చ సాగిస్తారు. ఏకంగా చనిపోయాడనే వార్తలు వస్తాయి. దానికి.. కిమ్ చెల్లి కీలక బాధ్యతలు తీసుకోవడమే కారణంగా చూపుతుంటారు. మొత్తానికి కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు మరోసారి చెక్‌ పడింది. 
 
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో కిమ్‌ ప్రత్యక్షమయ్యారు. ఐదు రోజుల క్రితం మే సాక్‌ సైక్లోన్‌ ఉత్తర కొరియా తీరాన్ని తాకింది. ఈ తుపాను వల్ల భారీ నష్టం జరిగింది. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కిమ్‌ పర్యటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని సిబ్బందిని ఆదేశించారు. మే సాక్‌ సైక్లోన్‌ వల్ల ఉత్తర కొరియాలో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయ్‌. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments