Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ చెరలో 19 మంది భారతీయులు...

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:14 IST)
పాకిస్థాన్ చెరలో 19 మంది భారతీయులు బందీలుగా ఉన్నారు. వీరంతా దేశ సరిహద్దులను చట్టువిరుద్ధంగా దాటారని ఆరోపిస్తూ పాకిస్థాన్ అధికారులు వీరిని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం వాళ్లు దేశంలోకి ప్రవేశించారని, ప్రస్తుతం వివిధ జైళ్లలో ఉన్నారని పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు.
 
మరోవైపు, ఇదే తరహా కేసులో మరో ముగ్గురు బంగ్లాదేశ్‌ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే నవంబర్‌ 9వ తేదీన పాకిస్థాన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగబోతున్నదని వెల్లడించారు. గూఢచర్యం ఆరోపణలపై సదరు నిందితులను భద్రతా పరిరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్టు వివరించారు. 
 
పాకిస్థాన్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. వారు గూఢచారులు కాదనీ, అమాయమకులైన తమ పౌరులపై పాకిస్థాన్ గూఢచర్యం ఆరోపణలు మోపి.. బందించిందని ఆరోపించారు. తక్షణం ఆ 19 మంది పౌరులను విడుదల చేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments