Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనేగానీ అమెరికా అధ్యక్షుడిగా ఉండివుంటేనా... డోనాల్డ్ ట్రంప్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:14 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో ఐఎస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో దాదాపు వంద మందివరకు మృత్యువాతపడ్డారు. అలాగే, మున్ముందు కూడా ఆప్ఘాన్‌లో మరిన్ని దాడులు జరగవొచ్చని అమెరికా టాప్ నిఘా సంస్థ హెచ్చరించింది. 
 
ఈ దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తాను అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే అస‌లు ఈ కాబూల్ దాడులు జ‌రిగేవే కావ‌న్నారు. "ఒక‌వేళ నేను మీ అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే ఈ విషాదం ఎప్ప‌టికీ జ‌రిగి ఉండేది కాదు. ఎప్ప‌టికీ జ‌రిగేది కాదు. ఇలాంటిది అస‌లు జ‌ర‌గ‌దు" అని ట్రంప్ అన్నారు. 
 
కాగా, గురువారం జ‌రిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 100 మందికిపైగా మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ దారుణానికి పాల్ప‌డిన వాళ్ల‌పై ప్రతీకారం తీర్చుకుంటామ‌ని ఇప్ప‌టికే అధ్య‌క్షుడు జో బైడెన్ చెప్పిన విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments