Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేస్తాం : షింజో అబే

ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే వెల్లడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (10:35 IST)
ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే వెల్లడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉత్తర కొరియా దూకుడును నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. 
 
వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్‌లో పర్యటించనున్నారు. అయితే అప్పుడు నార్త్ కొరియా అంశాన్ని ట్రంప్‌తో చర్చించనున్నట్లు అబే తెలిపారు. రష్యా, చైనాలతోనూ ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. పదేపదే అణుపరీక్షలతో బెంబేలెత్తిస్తున్న నార్త్ కొరియాపై బలమైన ఒత్తిడి తీసుకురానున్నట్లు అబే చెప్పారు. 
 
జపాన్ ప్రజల రక్షణను తాను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అబేకు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ).. కొమిటో పార్టీతో కలిసి.. దిగువసభకు మొత్తం 465 స్థానాలకుగాను 313 స్థానాలను గెలుచుకున్నది. ఈ మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించేందుకు అబే సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments