Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ భూకంపం: 155 కంపించిన భూకంపం.. 24 మంది మృతి

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (13:43 IST)
జపాన్‌ను వరుస భూకంపాలు వణికించాయి. ఒక్క రోజులో భూమి 155 సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసమై పలు ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. 
 
శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంత మంది చిక్కుకుపోయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫుమియో కిషిడా ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఆర్మీ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు. ప్రాణనష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో తీరప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెబుతున్నారు. 
 
కాగా, భూకంప తీవ్రతకు మెట్రో స్టేషన్ కంపించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. అంతే కాకుండా భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments