జపాన్ భూకంపం: 155 కంపించిన భూకంపం.. 24 మంది మృతి

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (13:43 IST)
జపాన్‌ను వరుస భూకంపాలు వణికించాయి. ఒక్క రోజులో భూమి 155 సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసమై పలు ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. 
 
శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంత మంది చిక్కుకుపోయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫుమియో కిషిడా ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఆర్మీ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు. ప్రాణనష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో తీరప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెబుతున్నారు. 
 
కాగా, భూకంప తీవ్రతకు మెట్రో స్టేషన్ కంపించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. అంతే కాకుండా భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments