Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ భూకంపం: 155 కంపించిన భూకంపం.. 24 మంది మృతి

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (13:43 IST)
జపాన్‌ను వరుస భూకంపాలు వణికించాయి. ఒక్క రోజులో భూమి 155 సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసమై పలు ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. 
 
శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంత మంది చిక్కుకుపోయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫుమియో కిషిడా ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఆర్మీ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు. ప్రాణనష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో తీరప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెబుతున్నారు. 
 
కాగా, భూకంప తీవ్రతకు మెట్రో స్టేషన్ కంపించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. అంతే కాకుండా భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments