Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాకు ఇప్పట్లో విమానాలు లేనట్లే

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (11:02 IST)
భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేధం కొనసాగుతుందని తాజాగా ప్రకటించింది. ఇక కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న తొలిసారి భారత విమానాలపై కెనడా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత బ్యాన్‌ను పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఐదోసారి నిషేధాన్ని పొడిగించింది. అయితే, కార్గో, ఇతర అత్యావసర విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదని, పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా కెనడా అధికారులు వెల్లడించారు.
 
సెప్టెంబర్ 21, రాత్రి 11.59 గంటల వరకు భారత్ నుంచి వచ్చే అన్ని కమర్షియల్, ప్రైవేట్ ప్యాసెంజర్ విమానాలపై బ్యాన్ కొనసాగుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

కాగా, నేరుగా వచ్చే విమానాల ద్వారా కాకుండా ఇతర దేశాల గుండా కెనడా వచ్చే భారతీయులు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూఏఈ‌తో పాటు ఇతర కొన్ని దేశాలు భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రయాణాలపై పలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments