గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు... 22 మంది మృత్యువాత

ఠాగూర్
గురువారం, 20 నవంబరు 2025 (08:58 IST)
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోమారు వైమానిక దాడులకు తెగబడింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళ గాజా స్ట్రిప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా డిఫెన్స్ ఏజెన్సీ అధికారికంగా వెల్లడించింది. 
 
గాజా అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. గాజా నగరంలో 12 మంది, ఖాన్ యూనిస్ ప్రాంతంలో మరో 10 మంది మరణించారు. ఈ మృతుల సంఖ్యను కూడా హమాస్ వర్గాలు కూడా ధృవీకరించాయి. 
 
అయితే, ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలిటరీ భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. తమ దేశంపై దాడి చేసేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు చేసినట్టు పేర్కొంది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు ఇజ్రాయేల్ సైన్యం స్పష్టం చేసింది. ఇరు వర్గాల పరస్పర ఆరోపణల నేపథ్యంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments