Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిష్ కర్రీ టేస్ట్ చేద్దామని రెస్టారెంట్‌కు వెళ్తే...

Webdunia
సోమవారం, 4 జులై 2022 (10:19 IST)
ఫిష్ కర్రీ టేస్ట్ చేద్దామని రెస్టారెంట్ ఫుడ్‌ను టేస్ట్ చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన ఫుడ్‌లో.. ఇనుప వస్తువు కనిపించడంతో కంగుతింది.
 
ఆ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బందికి తెలియజేయగా.. వాళ్ల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఆమె మైండ్ బ్లాక్ అయింది. దీంతో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. వారం రోజులపాటు పని ఒత్తిడిని భరించిన మలేషియాకు చెందిన ఓ మహిళ.. వీకెండ్‌లో సరదాగా కాలక్షేపం చేసి రిలీఫ్ కావాలని భావించింది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న రెస్టారెంట్‌ను విజిట్ చేసింది. 
 
అనంతరం ఫిష్ కర్రీతో కూడిన భోజనాన్ని ఆమె ఆర్డర్ చేసింది. కొద్ది సమయం తర్వాత సిబ్బంది తీసుకొచ్చిన ఫుడ్‌ను తినడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో చేప తల తింటుండగా అందులో ఆమె ఇనుముతో చేసిన గాలం కనిపించింది. అది చూసి ఒక్కసారిగా ఆమె కంగుతింది. వెంటనే సిబ్బందిని పిలిచి విషయం చెప్పింది.
 
అయితే వాళ్లు దాన్ని లైట్ తీసుకోవడంతో వాదనకు దిగింది. దీంతో రెస్టారెంట్ మేనేజర్ కలజేసుకున్నాడు. ఆమెకు జరిగిన చేదు అనుభవానికి క్షమాపణ చెప్పి, బిల్లులో డిస్కౌంట్ ఇస్తామనడంతో గొడవ సద్దుమణిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments