ఫిష్ కర్రీ టేస్ట్ చేద్దామని రెస్టారెంట్‌కు వెళ్తే...

Webdunia
సోమవారం, 4 జులై 2022 (10:19 IST)
ఫిష్ కర్రీ టేస్ట్ చేద్దామని రెస్టారెంట్ ఫుడ్‌ను టేస్ట్ చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన ఫుడ్‌లో.. ఇనుప వస్తువు కనిపించడంతో కంగుతింది.
 
ఆ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బందికి తెలియజేయగా.. వాళ్ల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఆమె మైండ్ బ్లాక్ అయింది. దీంతో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. వారం రోజులపాటు పని ఒత్తిడిని భరించిన మలేషియాకు చెందిన ఓ మహిళ.. వీకెండ్‌లో సరదాగా కాలక్షేపం చేసి రిలీఫ్ కావాలని భావించింది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న రెస్టారెంట్‌ను విజిట్ చేసింది. 
 
అనంతరం ఫిష్ కర్రీతో కూడిన భోజనాన్ని ఆమె ఆర్డర్ చేసింది. కొద్ది సమయం తర్వాత సిబ్బంది తీసుకొచ్చిన ఫుడ్‌ను తినడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో చేప తల తింటుండగా అందులో ఆమె ఇనుముతో చేసిన గాలం కనిపించింది. అది చూసి ఒక్కసారిగా ఆమె కంగుతింది. వెంటనే సిబ్బందిని పిలిచి విషయం చెప్పింది.
 
అయితే వాళ్లు దాన్ని లైట్ తీసుకోవడంతో వాదనకు దిగింది. దీంతో రెస్టారెంట్ మేనేజర్ కలజేసుకున్నాడు. ఆమెకు జరిగిన చేదు అనుభవానికి క్షమాపణ చెప్పి, బిల్లులో డిస్కౌంట్ ఇస్తామనడంతో గొడవ సద్దుమణిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments