Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని చంపిన వ్యక్తికి పరిహారం... ఎవరు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:50 IST)
నిందితునిగా 39 సంవత్సరాలు జైల్లో గడిపినందుకు పరిహారంగా కాలిఫోర్నియా ప్రభుత్వం ఓ వ్యక్తికి రోజుకు 140 డాలర్లు (రూ.9,500పైగా) ప్రకటించింది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడని రుజువుకావడంతో ప్రభుత్వం ఇలా చేసింది. 40 సంవత్సరాల క్రితం తన ప్రియురాలిని మరియు తన నాలుగేళ్ల కొడుకుని దారుణంగా హత్య చేసాడని నింద ఆరోపించబడి అతడిని అరెస్ట్ చేశారు. 
 
కానీ అతను తాను ఈ హత్యలు చేయలేదని ఎంత మొరపెట్టుకున్నా కోర్టు అతడిని నమ్మలేదు. దాంతో అతడిని దోషిగా నిర్ణయించి జీవిత ఖైదు విధించింది కోర్టు. కానీ ఆ వ్యక్తి తన పట్టు విడవలేదు. తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి కోర్టులో హంతకుడు కాదని నిరూపించుకున్నాడు. 
 
దాంతో పొరపాటున అతనికి శిక్ష విధించామని పశ్చాత్తాప్పడిన కాలిఫోర్నియా ప్రభుత్వం అతడికి జైల్లో గడిపినన్ని రోజులు రోజుకి 140 డాలర్లు చొప్పున ప్రకటించింది. లెక్క గట్టి 1.95 మిలియన్ డాలర్లు (రూ.14కోట్లకు పైగా) చెల్లించింది. దాంతో అతడు ఓ ఇల్లు కొనుక్కొని అందులో ఉంటున్నాడు. 
 
అతడు కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వలేమని భావించిన ఆ ప్రభుత్వం అతనికి ఇంకా సహాయం చేయాలనుకుంది. 21మిలియన్ డాలర్లు (150 కోట్లు) చెల్లిస్తామని ప్రకటించింది. అతడు కోల్పోయిన జీవితంతో పోలిస్తే ఇది చాలా చిన్న సహాయం అని పేర్కొంది. 71 ఏళ్ల క్రైగ్ ఆ డబ్బుతో తాను చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూస్తానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments