సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

ఠాగూర్
గురువారం, 27 నవంబరు 2025 (12:21 IST)
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం ఆషే ప్రావిన్స్‌కు సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా ఇప్పటికే కొండచరియలు, ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆ దేశాన్ని ఈ ప్రకృతి విపత్తు వణికించింది. 
 
సైక్లోన్ సెన్యార్‌ కారణంగా సుమిత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ లభ్యమైంది. ఈ వరదల వల్ల బ్రిడ్జ్‌ కూలిపోవడంతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి. దాంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు. 
 
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌కు సమీపంలో ఉండే ఇండోనేసియా తరచూ భూకంపాలు, సునామీ వంటి విపత్తులను ఎదుర్కొంటోంది. ఈ రింగ్‌ అనేది పసిఫిక్‌ మహాసముద్ర తీరం వెంట విస్తరించి ఉన్న భారీ టెక్టోనిక్‌ బెల్ట్‌. ఇక్కడే 90 శాతం భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, అలస్కాలోని అల్యూటియన్‌ ద్వీపాలు దీని పరిధిలోకి వస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments